మా నియోజకవర్గానికి బలమైన నాయకుడు కావాలి.. నాదెండ్లను కోరిన జానీ

జనసేన పార్టీ బలోపేతంలో భాగంగా జనసేన పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ శ్రీకాకుళం జిల్లా సన్ రైజ్ హోటల్ నందు పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలతో సమావేశమయ్యారు. మీటింగ్ అనంతరం నాదెండ్ల మనోహర్ ను జనసేన జానీ ప్రతేకంగా కలసి 2024లో పాలకొండ నియోజకవర్గంలో జనసేన పార్టీ తరుపునుంచి ఎమ్మెల్యే టికెట్ కావాలని నాదెండ్లను కోరారు. ఈ సందర్భంగా జనసేన జానీ మాట్లాడుతూ గత ఎలక్షన్ లో పొత్తులో భాగంగా జనసేన పార్టీకి టికెట్ రాలేదు.. ఇప్పుడు ఆలా కాకూడదు, ఈ సారి ఓట్లు కచ్చితంగా గ్లాస్ గుర్తుకి వెయ్యాలని నియోజకవర్గ ప్రజలు ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గ సరైన నాయకుడుని మా నియోజకవర్గానికి అప్పచెప్పండి.. ఖచ్చితంగా గెలిపించుకునే బాధ్యత మా నాలుగు మండల నాయుకులు, వీరమహిళలు, జనసైనికులు, ప్రజలు తీసుకుంటారు అని చెప్పడం జరిగింది. అందుకు మనోహర్ భుజం తట్టి, చేతిలో చెయ్యవేసి మీరు కష్టపడండి.. మీ పని మీరు, ఎవ్వరి పని వారు చెయ్యండి, కచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు పాలకొండ నియోజకవర్గానికి బలమైన నాయుకుడిని మీకు ఇస్తారు అని చెప్పడం జరిగింది.