పాలకొండ జిల్లా సాధన సమితి నిరాహార దీక్షలో జనసేన

పాలకొండలో 3వ రోజు ప్రారంభమైన రిలే నిరాహార దీక్షలో 3వ రోజు జనసేన పార్టీ పాలకొండ నియోజకవర్గ నాయకులు గర్భాన సత్తిబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పాలకొండ రెవెన్యూ డివిజన్ ను జిల్లా చేయాలని లేనియెడల శ్రీకాకుళం జిల్లాలోనే కొనసాగించాలని ఆయన అన్నారు. అలాగే రేపు జరగబోయే భారీ ర్యాలీలో అందరూ పార్టీలకతీతంగా పాల్గొని విజయవంతం చేయాలని ఆయన హితవు పలికారు.