జంపు శేఖర్ ను కలసిన పాలకొండ జనసేన నాయకులు

పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు శనివారం టీడీపీ నాయకులు జంపు శేఖర్ ను మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. జంపు శేఖర్ ప్రజారాజ్యం సమయంలో పార్టీ కోసం వీరఘట్టం మండలంలో చాలా చురుకుగా, నిస్వార్థంగా పని చేసిన వ్యక్తి,. ప్రస్తుతం ఆయన టీడీపీ పార్టీ తరుపున వీరఘట్టం మండలం జడ్పీటీసీగా పోటీ చేశారు. ఈ సందర్బంగా జనసేన జానీ, కర్రి కళ్యాణి, బబ్బాది పకీర్ నాయుడు వారి దృష్టికి జనసేన పార్టీ యొక్క ఆలోచనలను, సిద్ధాంతాలను.. పవన్ కళ్యాణ్ ప్రజలకి, రైతులకి మరియు కౌలు రైతులకి ఏవిదంగా అండగా ఉంటున్నారో తెలియజేసి.. ప్రజలకి ఎలాంటి కష్టం వచ్చినా జనసేన పార్టీ అండగా ఉంటుందనే భరోసాను ఇస్తూ.. సరికొత్త నాయకులకు యువతకి నాయకత్వం బాధ్యతలు అప్ప చెప్పే ఓకే ఒక్క పార్టీ జనసేన పార్టీ మాత్రమే అని, అలాంటి పార్టీకి ప్రతి ఒక్కరు అండగా ఉండాలి అని చెప్పడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో వీరఘట్టం మండలం జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *