వంగవీటి రంగాకు నివాళులు అర్పించిన పాలకొండ జనసేన

పాలకొండ: స్వర్గీయ వంగవీటి మోహనరంగా వర్ధంతి సందర్భంగా పాలకొండ నియోజకవర్గం కాంప్లెక్స్ ఆవరణ జంక్షన్ లో రంగా చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు సతివాడ వెంకటరమణ, గర్భాపు నరేంద్ర మాట్లాడుతూ.. వంగవీటి మోహనరంగా గారు నిస్వార్ధమైన రాజకీయ నాయకుడని, ఆయన చేసిన సేవలు మరువలేవని వర్ణించారు. మరియు పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆయన చేసిన పోరాటం మాకు స్ఫూర్తిదాయకమని అన్నారు. 1500 కుటుంబాలకు ఇళ్ళ పట్టాల పంపిణీ కోసం చేస్తున్న దీక్షలో ఉన్న వంగవీటి రంగా పై వ్యతిరేక శక్తులు చేశాయని, ఆయన ఈ లోకంలో లేకపోయినా మా అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్తామని జనసేన నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో వంగవీటి రంగా అభిమానులు, జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.