నల్ల బ్యాడ్జీలతో పాలకొండ జనసేన నిరసన

  • జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై రెక్కిని ఖండించిన పాలకొండ జనసేన

శ్రీకాకుళం జిల్లా, పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గర్భన సత్తిబాబు స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సత్తిబాబు మాట్లాడుతూ.. ఆనాడు వంగవీటి మోహన్ రంగాపై జరిగిన దాడిని గుర్తు చేస్తూ బడుగు బలహీన వర్గాల వారికి అండగా నిలబడి ప్రజల మన్నలను పొందిన వ్యక్తిని ప్రజలు తనకి రాజ్యాధికారం కట్టబెడతారేమోనని ముందస్తు భయంతో కొంతమంది పార్టీ నాయకులు, రెండు వర్గాల కుల నాయకులు, కలిపి ఆయనను హత మార్చారు. ఈరోజు పవన్ కళ్యాణ్ ని కూడా అదేవిధంగా తమ కులాల ఆధిపత్యం ఎక్కడ పోతుందని తమ రాజకీయ మనుగుడు ఉండదని పవన్ కళ్యాణ్ పై పక్క రాష్ట్రాల నుండి కొంతమంది గూండాలు తెప్పించి రెండు మూడు రోజుల నుండి రెక్కి నిర్వహించడం చూస్తుంటే. ఆరోజు వంగవీటి రంగా దూరం చేశారు ఈరోజు పవన్ కళ్యాణ్ ని దూరం చేసి కులాల మధ్యన విధ్వంసం సృష్టించాలనుకుంటున్నారా మీలాంటి నాయకులకు రాబోయే ఎన్నికల్లో ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారని ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. ఈ కార్యక్రమంలో వెంకట రమణ, జల్లు సోముబాబు, శేఖర్, సాయి, సంతోష్, ఆజాద్, రాంబాబు పాల్గొన్నారు.