పలమనేరు జనసేన ఆత్మీయ సమావేశం

పలమనేరు లో శుక్రవారం రాయలసీమ కో కన్వినిర్ గంగారపు రామదాసుచౌదరి, చిత్తూర్ జిల్లా కార్యదర్శి దిలీప్ అధ్యక్షతన గంటవూరిలో పలమనేరు టౌన్ ప్రెసిడెంట్ హరీష్ రాయల్ ఆధ్వర్యంలో జనసేన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ పలమనేరులో భలపడేవిధంగా దశ, దిశ కార్యాచరణ చేయడం జరిగింది. లోకల్ సమస్యల పైన బలంగా పోరాడాలి అని తీర్మానం చేయడం జరిగింది. ఈ సమావేశంలో పలమనేరు రూరల్ ప్రెసిడెంట్ నగరాజ్ వి కోట అధ్యక్షుడు ఏ.బి.ఎన్ బాబు, బైరెడ్డిపల్లె అధ్యక్షుడు నాని, జనసేన సీనియర్ నాయసకులు సందీప్ రాయల్, మైనారిటీ నాయకులు రబ్బానీ సల్మాన్, మదనపల్లె ప్రధాన కార్యదర్శి రెద్దమ్మ, మదనపల్లె రాంచరణ్ ప్రెసిడెంట్ నవీన్ మజ్యాల, చిత్తూర్ జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం తదితరులు పాల్గొన్నారు.