రైల్వే ఫ్లై ఓవర్ నిర్మాణం పనులు ప్రారంభించాలి: జనసేన డిమాండ్

గుడివాడ: గుడివాడ ప్రజల చిరకాల కోరిక అయినటువంటి రైల్వే ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం జరగకుండా వైసీపీ ప్రభుత్వం మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని టిడిపి మరియు బీజేపీ పార్టీలమీద విమర్శలు చేస్తూ కాలం గడుపుతూ ప్రజలకు అభివృద్ధి లేకుండా చేస్తున్నారు.

కావున దానిని నిరసిస్తూ గురువారం ఉదయం భీమవరం రైల్వే గేటు వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం పనులు వెంటనే ప్రారంభం చేయాలని గుడివాడ జనసేన పార్టీ తరఫున బూరగడ్డ శ్రీకాంత్ (ఇంచార్జి) ఆధ్వర్యంలో నిరసన తెలియ చేసి.. సంతకాల సేకరణ చేయటం జరిగినది.

2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే కొడాలి నాని వైసీపీ ప్రభుత్వం రాగానే గుడివాడ నియోజకవర్గం ప్రజలు ఆకాంక్ష ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న రైల్వే ఫ్లై ఓవర్ నిర్మాణం చేపడతా అని చెప్పి ఇప్పటి వరకు ఏమి చేయకుండా.. ఇప్పుడు మాయ మాటలు చెబుతూ గుడివాడ ప్రజలను తప్పు దోవ పట్టించే విధంగా బీజేపీ పార్టీ అడ్డు పడుతుంది అని ఎమ్మెల్యే కొడాలి నాని చెప్పటం చేతకాని తనం అని విమర్శించారు.

కావున జనసేన పార్టీ తరుపున ఫ్లై ఓవర్ నిర్మాణం జరగవలసిన భీమవరం గేట్ వద్ద నిరసన తెలియచేసి సంతకాల సేకరణ చేసి.. తక్షణం ఫ్లై ఓవర్ నిర్మాణం పనులు ప్రారంభించాలి అని డిమాండ్ చేయటం జరిగినది.

లేని పక్షంలో గుడివాడ నియోజకవర్గ ప్రజల తరుపున ఉద్యమం చేస్తాము అని ప్రజలకు అండగా జనసేన పార్టీ ఉంటుంది అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కొదమల గంగాధర రావు, రూరల్ మండలం అధ్యక్షుడు ఇంటూరి గజేంద్ర, వేమూరి త్రినాధ్, మజ్జి శ్రీనివాసరావు, చింతా రామకృష్ణ, షేక్ మీరా షరీఫ్, లక్ష్మీ కాంత్, సాయన రాజేష్, దుర్గారావు, జేమ్స్, దుర్గా తదితరులు పాల్గొన్నారు.