పల్లె పల్లె ఎగరాలి పవనన్న జెండా 30వ రోజు

నాగర్ కర్నూల్ నియోజకవర్గం మూడవ విడతగా తిమ్మాజిపేట మండలంలో 30వ రోజుగా పులగిరి గ్రామంలో వంగ లక్ష్మణ్ గౌడ్ పాదయాత్ర చేపట్టారు. కార్యక్రమంలో నాగర్ కర్నూల్ నియోజకవర్గ, మండల, నాయకులు జనసైనికులతో కలిసి వంగ లక్ష్మణ్ గౌడ్ గ్రామంలో పర్యటించారు.

గ్రామ ప్రజల సమస్యలు తెలిపారు
• గ్రామంలో సిసి రోడ్లు లేవు.
• రెండు పడకల గదులు ఇస్తామన్నారు. ఇంకా పూరి గుడిసెల్లోనే ఉంటున్నారు.
• కొత్త వారికి పించన్ అందించడం లేదు. అంటూ లక్ష్మణ్ గౌడ్ కి వారి సమస్యలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ నియోజకవర్గ నాయకులు వంగ విజయ్ భాస్కర్ గౌడ్, సత్యం, సూర్య, వంశీ రెడ్డి, నవీన్, ఎడ్ల ప్రసాద్, ఆంజనేయులు, పూస శివ, ఎడ్ల రాకేష్, ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.