జనసేనానిని మర్యాదపూర్వకంగా కలిసిన శతఘ్ని న్యూస్

మంగళగిరి, శతఘ్ని న్యూస్ డైరెక్టర్ మరియు జేఎస్పి గ్లోబల్ టీం వ్యవస్థాపకులు అయినటువంటి జర్మనీకి చెందిన వరికూటి సురేష్ ఆధ్వర్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను శతఘ్ని న్యూస్ వ్యవస్థాపకులు నాయుడు నిమ్మకాయల, శతఘ్ని న్యూస్ డైరెక్టర్ మరియు యూకె జనసేన వీరమహిళ పద్మజ రామిశెట్టి మరియు శతఘ్ని న్యూస్ డైరెక్టర్ మరియు యూకె జనసేన నాయకులు నాగరాజు వడ్రాణం మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా శతఘ్ని న్యూస్ వ్యవస్థాపకులు నాయుడు నిమ్మకాయల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు శతఘ్ని న్యూస్ చేస్తున్న కార్యక్రమాలను గురించి తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శతఘ్ని న్యూస్ గురించి మరిన్ని వివరాలను అడిగి తెలుసుకుని పార్టీ బలోపేతం కోసం మరింత కృషి చేయాలని తెలిపారు.

జనసేన పార్టీ బలోపేతానికి రాముడికి ఉడత సాయం:

ఒక జర్నలిస్ట్ లాగా యుద్ధం మొదలుపెట్టి అనునిత్యం ప్రజల తరపున పోరాటం చేస్తున్న నిమ్మకాయల నాయుడు మూడు సంవత్సరాల శతఘ్ని న్యూస్ కృషికి చిరు ఫలితం లభించింది. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని శతఘ్ని న్యూస్ (ఈ పేపర్ – యూట్యూబ్) వ్యవస్థాపకులు నిమ్మకాయల నాయుడు మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ బలోపేతానికి శతఘ్ని న్యూస్ టీం చేస్తున్న కృషికి నిమ్మకాయ నాయుడుకి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. నాయుడు రాబోవు రోజుల్లో శతఘ్ని న్యూస్ టీం ఎంతవరకు పార్టీకి సపోర్ట్ చేయబోతుందో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి క్లుప్తంగా వివరించి రానున్న రోజుల్లో శతఘ్ని న్యూస్ జనసేన చేయబోయే ప్రతి కార్యక్రమంలో భాగమవుతుందని తెలియజేశారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శతఘ్ని న్యూస్ యొక్క పనితీరును, మరిన్ని వివరాలను అడిగి తెలుసుకున్నారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ మీదున్న అభిమానాన్ని ఒక్కొక్కరు ఒక్క రూపంలో చూపించినట్టు. జనసేన పార్టీ చేస్తున్న ఎన్నో ప్రజా పోరాటాలు, అది ప్రజల వరకు చేర్చే ప్రచార మాధ్యమాలు లేవని తెలుసుకున్న నిమ్మకాయల నాయుడు శతఘ్ని న్యూస్ పేపర్ స్థాపించి అనుక్షణం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు చేస్తున్న పోరాటాలను సేవలను అనునిత్యం ఈ పేపర్ మరియు యూట్యూబ్ – సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరవేయుటకు తన వంతు కృషి చేస్తున్నారు.