అగ్నిప్రమాద బాధితులకు అండగా పామర్రు జనసేన

పామర్రు, పామర్రు సెంటర్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వెనుక ఉన్న కొబ్బరి తోటలో ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో ఏడు కుటుంబాలలో విషాద చాయలు చోటు చేసుకున్నాయి. ఈ విషయం తెలుసుకున్న పామర్రు జనసేన పార్టీ ఇంచార్జ్ తాడిశెట్టి నరేష్ మరియు పామర్రు జనసేన పార్టీ మండల అధ్యక్షులు గుంప గంగాధర రావు పార్టీ తరఫున బాధితులకు ఆర్థిక సహాయం నూతన వస్త్రాలు మరియు బియ్యం అందజేసి బాధితులకు బాసటగా నిలిచారు. ఈ కార్యక్రమంలో కృష్ణాజిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీమతి కాకి ఝాన్సీ, రాపర్ల ఎంపిటిసి కూనపరెడ్డి సుబ్బారావు, వీరమహిళలు సంధ్య, యమున జనసైనికులు సాత్విక్, కిట్టు, క్రాంతి, బాలాజీ, గుంప అజయ్, శివ, అనిల్ మరియు కాకర్ల దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొని బాధితులకు ఆసరాగా ఉంటామని తెలియజేయడం జరిగింది.