జనసేన పార్టీ నూతన కమిటీ ప్రమాణస్వీకారం

ఏలూరు నియోజకవర్గం 19వ డివిజన్ ఎన్టీఆర్ కాలనీలో మండల అధ్యక్షులు వీరంకి పండు ఆధ్వర్యంలో ఆదివారం జనసేన పార్టీ నూతన కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక సమస్యలపై ఏలూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి రెడ్డి అప్పలనాయుడు అధ్యక్షతన బహిరంగ సభ ఏర్పాటు చేశారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి వైఎ్సార్సీపీ నుండి మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కూన అనసూయ, వాలంటీర్ గా పనిచేసే ముగ్గురు యువకులు పప్పు మురళి, పప్పు కిరణ్, గోపోతుల శ్రీను రాజీనామా చేసి పార్టీలో చేరారు. స్థానిక టీడీపీ వైఎ్సార్సీపీ నుండి సుమారు 100 మంది చేరారు. ముఖ్య అతిధులుగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి ఘంటసాల వెంకటలక్ష్మి, ఉంగుటూరు నియోజకవర్గం ఇంచార్జ్ ధర్మరాజు, పశ్చిమగోదావరి జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు నిమ్మల జ్యోతి కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు ఇళ్ళ శ్రీనివాస్, జిల్లా సంయుక్త కార్యదర్శి శ్రావణ్, జిల్లా కార్యదర్శి తేజస్విని, వాణీ మరియు నియోజకవర్గ నాయకులు, జనసైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.