విద్యుత్ ప్రమాద బాధితునికి మనోధైర్యాన్నిచ్చిన పాలూరు బాబు

బొబ్బిలి నియోజకవర్గం, బాడంగి మండలం వాడాడ గ్రామానికి చెందిన జనార్ధనరావు అనే వ్యక్తి బొబ్బిలి విద్యుత్ సబ్ స్టేషన్లో స్విఫ్ట్ ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి తీవ్రంగా శరీరమంతా కాలిపోవడం జరిగింది. అతని కుటుంబ సభ్యులను జనసేన రాష్ట్ర ప్రచార కార్యదర్శి శ్రీ బాబు పాలూరు గారు మరియు కురుపాం పార్వతీపురం,బొబ్బిలి నియోజక వర్గ నాయకులు మరియు జనసైనికులు పరామర్శించి, ఆ కుటుంబానికి ధైర్యం చెప్తూ మీకు జనసేన పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని బాబు పాలురు భరోసా ఇవ్వడం జరిగింది. అలాగే విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగుల కష్టాలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకు వెళ్తానని మీకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇవ్వడం జరిగింది. మీ అబ్బాయి క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చేవరకు మీకు అండగా ఉంటామని ఏ అవసరం వచ్చినా మాకు కాల్ చేయండి అని చెప్తూ వాళ్ళలో గుండె ధైర్యాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.