జగనన్న కాలనీలలో పామురు మండల జనసేన డిజిటల్ క్యాంపెయిన్

కనిగిరి నియోజకవర్గం: రాష్ట్ర జనసేన అధ్యక్షులు కోణిదెల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు శనివారం ప్రకాశం జిల్లా, పామురు మండలంలోని జగనన్న కాలనీలను జనసేన ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ దోపిడీ విధానాన్ని ప్రజలందరూ గమనించాలని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కార్యక్రమాల కార్యదర్శి రామిశెట్టి సునీల్ కుమార్, జిల్లా కార్యదర్శి రహిముల్లా, ముత్తు, హరి, సునీల్, సూర్యనారాయణ, మణికంఠ మరియు సాయి పాల్గొన్నారు.