క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ చేసిన పంతం నానాజి

కాకినాడ రూరల్, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ల పిలుపుమేరకు రాష్ట్ర వ్యాప్తంగా క్రియశీలక సభ్యత్వ పంపిణీ 3రోజుల కార్యక్రమంలో భాగంగా మూడవ రోజు కాకినాడ రూరల్ నియోజకవర్గం కాకినాడ రూరల్ మండలం గంగనపల్లి గ్రామంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శిరంగు శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామ కమిటీ అధ్యక్షులు కుర్ర నాగేశ్వరావు అధ్యక్షతన జనసేన పార్టీ క్రియశీలక సభ్యత్వం చేయించుకున్న వారికి సభ్యత్వ కిట్లను గంగనపల్లి గ్రామంలో ఇంటింటికి వెళ్లి అందించే కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన జనసేన పార్టీ పిఏసి సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీకి ఘన స్వాగతం పలికిన గ్రామ జనసైనికులు కిట్ల పంపిణి గ్రామంలోని అన్ని ప్రాంతాల్లోని వారికీ అందించడం, మార్గ మధ్యలో డాక్టర్బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి జై భీం లు చెప్పి, అక్కడ కొంతమందికి జనసేన పార్టీ సభత్వ కిట్లను అందించారు. స్థానిక మహిళలు ప్రస్తుత ప్రభుత్వం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని, తినడం కూడా కష్టంగా ఉందని నానాజీకి తెలిపారు. వారికి త్వరలో ప్రజాప్రభుత్వం రాభోతోంది అధైర్య పడవద్దని వారికి ధైర్యం చెప్పడం జరిగింది. అనంతరం జనసేన పార్టీ జండా ఆవిష్కరణ చేసారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ మండల కమిటీ అధ్యక్షులు కరెడ్ల గోవింద్, స్థానిక జనసేన నాయకులు, రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.