చిన్నారి మందులకు ఆర్ధికసాయమందించిన పంతం నానాజీ

కాకినాడ రూరల్ 3 వ డివిజన్ గొడరిగుంట ప్రాంతం పల్లెపేటలో గల మత్స్యకార నిరుపేద కుటుంబానికి చెందిన పాప తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ, నెలకి మందుల ఖర్చు 3500 రూపాయలు అవుతున్నది అనే విషయం తెలుసుకుని జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ మంగళవారం వారి ఇంటికి వెళ్ళి 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.