హక్కుల కోసం బెంతు ఒరియాల పోరాటం 18వ రోజు

ఇచ్చాపురం: కవిటిలో తమ హక్కులకోసం పోరాటం చేస్తున్న బెంతు ఒరియాల 18వ రోజు నిరాహార దీక్షలో వరక గ్రామస్తులు, పెద్దలు, యువత, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ పురియా మాట్లాడుతూ బెంతు ఒరియా ప్రజలకు న్యాయం జరిగే వరకూ పోరాడుతం అని అన్నారు. ఎన్నికల ముందు తాము ఓటరుగా గుర్తు ఉన్న మేము ఓటు వేశాక పట్టించుకోవడం లేదని నినాదాలతో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో జయసేన్, మేఘనాత్, దుదిస్టి, సుమన్, బృందావన్, రజినీ కుమార్, శ్రీకాంత్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.