కోర్టు వాయిదాకు హాజరైన పంతం నానాజీ

కాకినాడ రూరల్: 2020 జనవరి 12వ తేదీన కాకినాడలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిరసన తెలుపుతున్న జనసేన శ్రేణులపై వైసీపీ నాయకులు, కార్యకర్తలు దాడి చేసి అక్రమంగా కేసులు బనాయించిన సంగతి అందరికీ విదితమే. ఆ కేసుల నిమిత్తం కాకినాడ జిల్లా కోర్టు వాయిదాకు బుధవారం జనసేన పార్టీ పీఏసీ సభ్యులు కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ హాజరయ్యారు. నాలుగు సంవత్సరాలనుండి కోర్టు వాయిదాలకు న్యాయస్థానాలపై ఉన్న గౌరవంతో హాజరువుతున్నామని పంతం నానాజీ తెలిపారు.