గంగారపు రాందాస్ చౌదరి ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

మదనపల్లి: జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి ఆధ్వర్యంలో బుధవారం మదనపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ క్రియా శీలక సభ్యత్వ కిట్లు వాలెంటీర్స్ కు అందజేయడం జరిగింది. కిట్లలో పవన్ కళ్యాణ్ మనోగతం బుక్, జనసేన బ్యాగ్, గాజు టీ గ్లాసు, నోట్ బుక్ మరియు జనసేన పార్టీ ఐడి కార్డు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా గంగారపు రాందాస్ చౌదరి మాట్లాడుతూ.. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపును అందుకొని మదనపల్లి నియోజకవర్గంలో 3000 లకు పైగా జనసేన పార్టీ క్రియా శీలక సభ్యులు స్వచ్ఛందంగా చేరడం చాలా సంతోషంగా ఉందని అని, ఇటు టిడిపి పార్టీ కానీ ఇతర పార్టీలు కానీ 3000 పైగా సభ్యత్వాలు నమోదు చేసిన దాఖలాలు లేవని అన్నారు. అన్నమయ్య జిల్లాలో మదనపల్లి నియోజకవర్గం మొట్ట మొదటి స్థానంలో ఉందని, దీనికి కారణం అయిన ప్రతి ఒక వాలంటీర్ కు, ప్రతి ఒక సభ్యులకు పేరుపేరునా మదనపల్లి జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసారు. రాబోయే ఎన్నికల్లో మా నాయకుడు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ గా ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నారో అదేవిధంగా మేము కూడా మదనపల్లిలో వైసీపీ విముక్త ఆంధ్ర ప్రదేశ్ అనే నినాదంతో మదనపల్లిలో జనసేనికులు అంత వైసీపీని రాబోయే కురుక్షేత్రంలో మట్టి కరిపించి మదనపల్లి నియోజకవర్గాన్ని గెలిపించి పవన్ కళ్యాణ్ కి కానుకగా ఇస్తామని తెలియజేశారు. నియోజకవర్గాలు జాగీరా లేక ఇది ప్రజాస్వామ్యమా? లేక ఇంకా ఏ ప్రతి పక్ష పార్టీ లు ఉండకూడదా? ప్రోగ్రాంలు చేయకూడదా? మొన్న జరిగిన టిడిపి పార్టీ పైన అంగల్లు, పుంగనూరులో కొంతమంది ఆకతాయిలతో రాళ్లను విసరడం వారి పైన జరిగిన దాడులను జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం రాయల్, ఐటీ ప్రధాన కార్యదర్శి రాజేష్ కుమార్, గడ్డం లక్ష్మీపతి, లక్ష్మి నారాయణ, సనా ఉల్లా, కుమార్, గండి కోట లోకేష్, కుమార్, జంగాల గౌతమ్, ప్రసాద్, క్రాంతి, నవాజ్, శేఖర తదితరులు పాల్గొన్నారు.