అమరావతి రైతుల పాదయాత్రకు ఘనస్వాగతం పలకాలని పిలుపునిచ్చిన పంతం నానాజీ

కాకినాడ రూరల్, అమరావతి రైతుల పాదయాత్ర ఈ నెల 23వ తేదీన కాకినాడ జిల్లాలో ప్రవేశిస్తున్న సందర్బంగా స్వాగతం పలకడానికి అఖిలపక్షం ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలకాలని కోరుతూ కాకినాడ కౌస్తుబ రెస్టారెంట్ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ పాల్గొని అమరావతి రైతుల పాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరిగింది.