ఆత్మహత్య చేసుకున్న విద్యార్ధిని కుటుంబానికి న్యాయం జరిపించాలని కోరిన జనసేన

నాగర్ కర్నూల్ నియోజకవర్గం, తిమ్మాజిపేట్ మండలం హనుమాన్ తాండకు చెందిన విద్యార్థిని జడ్చర్లలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతుంది. ఆ విద్యార్థిని గురువారం ఉదయం పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుని మరణించింది. ఇందులో భాగంగా జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర యువజన అధ్యక్షులు మరియు నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి వంగ లక్ష్మణ్ గౌడ్ ఆదేశాల మేరకు నాగర్ కర్నూల్ పార్లమెంటరీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ శ్రీనివాస్ నాయక్ ఆధ్వర్యంలో తిమ్మాజిపేట్ మండల నాయకులు ఎడ్ల శివ, ప్రసాద్, శ్రీకాంత్, ఆల్తాఫ్, బాలు, సాయి, గోవింద్, గోపిలు హనుమాన్ తండా గ్రామానికి వెళ్ళి విద్యార్థిని మృతదేహానికి సంతాపం తెలియజేశారు. ఈ సంద్భంగా ఆ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడానికి గల నిజానిజాలను పోలీసులు తక్షణమే విచారణ జరిపించి, ఆ కుటుంబానికి న్యాయం జరిపించాలని జనసేన పార్టీ తరపున కోరారు.