నూరుకుర్తి శ్రీనివాస్ కి ట్రై సైకిల్ అందజేసిన పంతం నానాజీ

కాకినాడ రూరల్ మండలం, కొవ్వాడ గ్రామానికి చెందిన దివ్యాంగులు నూరుకుర్తి శ్రీనివాస్ కి కాకినాడ గొడరిగుంట జనసేన పార్టీ రూరల్ కార్యాలయం వద్ద తదేకం ఫౌండేషన్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన ట్రై సైకిల్ ని జనసేన పార్టీ రాష్ట్ర పిఏసి సభ్యులు మరియు కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తదేకం ఫౌండేషన్ ప్రతినిధి చావ్వకుల సందీప్, తెలుగుదేశం నాయకులు రాందేవు సీతయ్య దొర, జనసేన నాయకులు, కరెడ్ల గోవింద్, తోట వేణు, గుమ్మడి వీరబాబు, జీని శ్రీను, మాగపు మహేష్ తదితరులు పాల్గొన్నారు.