వీరవాసరం మండలాధ్యక్షునిగా పుప్పాల వీర వెంకట నరసింహారావు

భీమవరం నియోజకవర్గం, వీరవాసరం మండల జనసేన పార్టీకి మండల అధ్యక్షునిగా పవన్ కళ్యాణ్ చే నియమితులైన మత్స్యపురి గ్రామానికి చెందిన పుప్పాల వీర వెంకట నరసింహారావు (బాలాజీ)ని వీరవాసరం మండల గ్రామ జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేయటం జరిగింది. మండల అధ్యక్షులు బాలాజీ మాట్లాడుతూ జనసేన పార్టీ బలోపేతానికి మనందరం కలిసి ఈరోజు నుండే కృషి చేసి రానున్న 2024 ఎన్నికలలో వీరవాసరం మండలంలో జనసేనకి భారీ మెజారిటీ తీసుకువచ్చేలా దిశానిర్దేశం గట్టి ప్రణాళికతో ముందుకు వెళదాం అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు వీరమహిళలు నాయకులు పాల్గొన్నారు.