ఉచిత కుట్టు శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించిన పంతం నానాజీ

కాకినాడ రూరల్ నియోజకవర్గం: కాకినాడ రూరల్ మండలం, గైగోలుపడు ప్రాంతంలో స్థానిక జనసేన వీరమహిళ నాయకురాలు జి.లక్ష్మి ఆధ్వర్యంలో తదేకం ఫౌండేషన్ వారి ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు శిక్షణా కేంద్రాన్ని జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తదేకం ఫౌండేషన్ ప్రతినిధి శాండీ, కాకినాడ రూరల్ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.