వరికూటి నాగరాజుని మర్యాదపూర్వకంగా కలిసిన గనివనిపాడు జనసైనికులు

ప్రకాశం జిల్లా జనసేన పార్టీ లీగల్ సెల్ కార్యదర్శి మరియు దర్శి నియోజకవర్గ జనసేన నాయకులు వరికూటి నాగరాజుని వారి కార్యాలయంలో కొనకనమెట్ల మండలం, గనివనిపాడు గ్రామ జనసైనికులు బోరిగోర్ల శ్రీనివాస్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. మే 1 వ తారీఖున జరగబోయే కలివలిపల్లి గ్రామంలో జరిగే ఎల్లమ్మతల్లి కొలుపులకు ఆహ్వానించడం జరిగినది. ఈ కార్యక్రమంలో గడ్డిపాటి వేణుగోపాల్, కొనకనమెట్ల మండలం జనసేన పార్టీ నాయకులు తోట శ్రీనివాస్ నాయుడు పాల్గొనడం జరిగినది.