కుట్టు శిక్షణా కేంద్రాన్ని సందర్శించిన పంతం నానాజీ

కాకినాడ రూరల్ మండలం, రేపూరు గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇటీవల తదేకం ఫౌండేషన్ వారి సహకారంతో ప్రారంభించిన కుట్టు శిక్షణా కేంద్రాన్ని జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ తో కలిసి తదేకం ఫౌండేషన్ ప్రతినిధులు శ్రీమతి సుధ, శ్రీమతి మాదవి సందర్శించారు. ఈ కార్యక్రమంలో రేపూరు జనసేన నాయకులు, రూరల్ మండల నాయకులు పెద్దసంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.