Paralympics: ఇండియన్ అథ్లెట్ల జోరు.. భారత్ కు 15 పతకాలు
టోక్యో పారాలింపిక్స్లో ఇండియన్ అథ్లెట్లు దూసుకుపోతున్నారు. తాజాగా పురుషుల మిక్స్డ్ 50మీ పిస్టోల్ ఎస్హెచ్1 షూటింగ్ ఈవెంట్లో రెండు పతకాలు కైవసం చేసుకున్నారు. మనీష్ నర్వాల్కు బంగారు పతకం రాగా, సింగ్రాజ్ అధానా రజతంతో మెరిశాడు. ఇప్పటికే పురుషుల 10మీ ఎయిర్ పిస్టోల్ విభాగంలో కాంస్యం దక్కించుకున్నాడు సింగ్రాజ్. ఈ మెగాటోర్నీలో ఇతడికి ఇది రెండో పతకం. మొత్తంగా ఈ రెండు పతకాలతో టోక్యో పారాలింపిక్స్లో భారత పతకాల సంఖ్య 15కు చేరింది.