Paralympics: ఇండియన్ అథ్లెట్ల జోరు.. భారత్ కు 15 పతకాలు

టోక్యో పారాలింపిక్స్​లో ఇండియన్ అథ్లెట్లు దూసుకుపోతున్నారు. తాజాగా పురుషుల మిక్స్​డ్ 50మీ పిస్టోల్ ఎస్​హెచ్​1 షూటింగ్​ ఈవెంట్​లో రెండు పతకాలు కైవసం చేసుకున్నారు. మనీష్ నర్వాల్​కు బంగారు పతకం రాగా, సింగ్​రాజ్ అధానా రజతంతో మెరిశాడు. ఇప్పటికే పురుషుల 10మీ ఎయిర్​ పిస్టోల్ విభాగంలో కాంస్యం దక్కించుకున్నాడు సింగ్​రాజ్. ఈ మెగాటోర్నీలో ఇతడికి ఇది రెండో పతకం. మొత్తంగా ఈ రెండు పతకాలతో టోక్యో పారాలింపిక్స్​లో భారత పతకాల సంఖ్య 15కు చేరింది.