పార్థసారథి చిత్రపటానికి నివాళులర్పించిన పితాని

రామచంద్రపురం, రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్చార్జ్ పితాని బాలకృష్ణ రామచంద్రపురం నియోజకవర్గంలో అకాల మరణం చెందిన రాష్ట్ర జనసేన పార్టీ అధికార ప్రతినిధి నారపరెడ్డి పార్థసారథి చిత్రపటానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట జిల్లా కార్యదర్శి సంపత్ జనసేన, మండల ప్రధాన కార్యదర్శి దూడల స్వామి తదితరులు పాల్గొన్నారు.