జనసేన ఆధ్వర్యంలో పార్థసారధి సంతాప సభ

తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి నారపరెడ్డి పార్థసారథి పెద్ద కార్యక్రమం సందర్భంగా రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో పార్థసారధి ఇంటి దగ్గరలో సంతాప సభ ఏర్పాటు చేయడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కందుల దుర్గేష్ రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్, ఉభయగోదావరి జిల్లా జనసేన పార్టీ కన్వీనర్ మేడ గురుదత్త ప్రసాద్, అనపర్తి జనసేన పార్టీ ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు, తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యవర్గ సభ్యులు జనసేన పార్టీ మండల అధ్యక్షులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, సర్పంచులు, వార్డ్ మెంబర్లు తదితర నియోజకవర్గ జనసేన నాయకులు, జనసైనికులు మరియు బిజెపి నాయకులు తదితరులు సంతాప సభలో పాల్గొని సంతాపం తెలియజేయడం జరిగింది.