జనసేన నిరసనకు అధికారుల స్పందన

పెందుర్తి, ఎడతెరిపిలేని వర్షాల కారణంగా నరవ గ్రామంలోని రోడ్లు చెరువులను తలపిస్తున్నాయని, ఈ రోడ్ల తో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, నరవ రోడ్డుపై నీరు నిలవకుండా చర్యలు చేపట్టమని కోరుతూ జనసేన ఆధ్వర్యంలో చేసిన నిరసనకు ప్రభుత్వ అధికారులు సానుకూలంగా స్పందించడం జరిగింది. ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ నాయుడుకు జనసేన పార్టీ నాయకులు వబ్బిన జనార్దన్ శ్రీకాంత్ సమస్యను వివరించి, రోడ్లు చెరువులను తలపిస్తున్నాయని, దీనివలన సుమారు 40 గ్రామాలు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని సమస్యను తెలియజేయడం జరిగింది. ఈ సమస్యపై తక్షణ చర్యలు తీసుకోమని, నీరు లేకుండా చేయమని కమిషనర్ అధికారులకు సూచించారు.