పవన్ తాజా చిత్రానికి టైటిల్ ఖరారు?

ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ ఓ చిత్రాన్ని చేస్తున్న సంగతి విదితమే. ఈ చిత్రం చారిత్రాత్మక కథా నేపథ్యంతో తెరకెక్కుతోంది. మొఘలాయీల కాలం నాటి వాతావరణంలో కథ సాగుతుంది. ఇందులో పవన్ వజ్రాలదొంగగా విభిన్న తరహా పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ‘విరూపాక్ష’ అనే టైటిల్ చాలా కాలం వరకు ప్రచారంలో వుంది. ఆ తర్వాత మరికొన్ని టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. చివరికి తాజాగా ‘హరిహర వీరమల్లు’ అనే టైటిల్ని ఖాయం చేసినట్టు తెలుస్తోంది. యూనిట్ లో అందరికీ ఈ టైటిల్ నచ్చడంతో దీనినే ఖరారు చేశారట. త్వరలోనే అధికారికంగా దీనిని ప్రకటిస్తారని సమాచారం.

ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం భారీ బడ్జెట్టుతో నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ గత కొన్ని రోజులుగా హైదరాబాదులో జరుగుతోంది. ఇందులో పవన్ సరసన నిధి అగర్వాల్, బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రం కోసం భారీ సెట్స్ కూడా వేస్తున్నారు.