కౌలు రైతులకు అండగా పవన్ కళ్యాణ్

*గోడపత్రికను ఆవిష్కరించిన ఇచ్చాపురం జనసేన

ఇచ్చాపురం, టీం పిడికిలి సహకారంతో ప్రచురించిన జనసేన అధినేత చేప్ట్టిన రైతు భరోసా యాత్ర గోడ పత్రికలను రేగిడి ఇచ్చాపురం నియోజకవర్గం తిప్పన దుర్యోధన రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ నాయకులు చేతుల మీదగా గోడ పత్రికలను ఆవిష్కరించారు. తిప్పన దుర్యోధన రెడ్డి మాట్లాడుతూ
ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు భరోసాగా ఒక కుటుంబానికి లక్ష రూపాయలు చొప్పున 3000 కుటుంబాలకు జనసేనాని 30 కోట్లు తన సొంత కష్టార్జితంతో ఆర్థిక సహాయాన్ని చేస్తున్నారని… రైతులు సంక్షేమం పవన్ కళ్యాణ్ తోనే సాధ్యమని జనసేన పార్టీ కి ఒక అవకాశం కల్పించమని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.