కౌలు రైతుకి అండగా జనసేన

*కౌలు రైతుకి అండగా జనసేన

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించి జిల్లాల వారీగా చనిపోయిన రైతు కుటుంబాలను పరామర్శిస్తూ వారికి లక్ష రూపాయలు అందజేయడం జరుగుతుంది. ఇటువంటి మహోన్నతమైన కార్యక్రమాన్ని చేపట్టిన పవన్ కళ్యాణ్ కి మద్దతుగా టీం పిడికిలి వారు రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాలకు గోడ పత్రికలు, ఆటో స్ట్రిక్కర్లు రూపొంచింది పంచడం అంటించడం కూడా జరుగుతుంది. టీం పిడికిలి గోడ పత్రికలు మరియు ఆటో స్ట్రిక్కర్లను జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వైస్ ప్రెసిడెంట్ అయిన శ్రీమతి సుంకర కృష్ణవేణి ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీం పిడికిలి ఇన్ఛార్జి యర్రవరపు రాజా, టీం పిడికిలి సభ్యులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.