పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం

పశ్చిమగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు కోటికలపూడి గోవింద్ మరియు ప్రధాన కార్యదర్శి కరటం సాయి సూచన మేరకు పోలవరం నియోజకవర్గ ఇంచార్జ్ చిర్రి బాలరాజు గారి ఆధ్వర్యంలో కుకునూర్ మండల అధ్యక్షుడు ములిశెట్టి యుగందర్ అధ్యక్షతన సోమవారం కుకనూరు మండలం, పెద రావిగూడెం గ్రామంలో కౌలు రైతులకు తన వంతు సాయం కింద ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికి తన కష్టార్జితం నుండి 41 మంది కౌలు రైతులకు లక్ష రూపాయల చొప్పున ఇచ్చినందున కృతజ్ఞతతో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. రైతు పక్ష నేత అని చెప్పుకునే ముఖ్యమంత్రి కౌలు రైతులను గాలికి వదిలేశారు. తను నమ్మిన ప్రజలకు ఏదో సహాయం చేయాలని ఒక సంకల్పంతో ముందుకు వచ్చి ప్రతి కౌలు రైతులకు సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కుకునూర్ మండల ఉపాధ్యక్షుడు వెంకన్నబాబు, మండల నాయకులు నాగరాజు, కృష్ట, గాడిద వెంకటేశ్వర్లు, శ్రీను, సిద్దు, వీర మహిళ బొక్క ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.