మైనర్ పేట ప్రాంతంలో జనంకోసం పవన్-పవన్ కోసం

కాకినాడ రూరల్ నియోజకవర్గం రూరల్ మండలం సూర్యారావు పేట గ్రామం మైనర్ పేట ప్రాంతంలో జనంకోసం పవన్-పవన్ కోసం మనం కార్యక్రమం ద్వారా ఉమ్మడి కార్యాచరణలో భాగంగా జనసేన నాయకులు సూర్యారావు పేట జనసేన నాయకుల ఆధ్వర్యంలో ఇంటింటికి పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఉన్న జనసేన పార్టీ పిఎసి సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ మరియు తెలుగుదేశం నాయకులు గరికిన రమణ. ఈ గ్రామంలో పంతం నానాజీకి స్థానిక ప్రజలు వారి సమస్యలను విన్నవించారు. మంచినీరు పైపు లైను పంటకాలవలో నుండీ రావడంతో కలుషితం అయిన నీరు వస్తోందని, డ్రైనేజీ వ్యవస్థ లేదని, పంచాయతీ సిబ్బంది కాలువలు శుభ్రం చేయడం లేదని, పరిశ్రమల నుండీ వచ్చే రసాయన రజను వల్ల కంటి చూపు కోల్పోయే పరిస్థితి ఉందని, పరిశ్రమ వ్యర్థలవల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని, వాయుకాలుష్యం ఎక్కువగా ఉందని, చెట్లు పెంచమని అడిగిన పట్టించుకోవడం లేదని, అధికారులు, పారిశుద్యం పట్టించుకోవడం లేదని, స్థానిక యువతకి ఉద్యోగ అవకాశాలు, భద్రత కల్పించాలని, వాటర్ ట్యాంక్ నిర్మించిన వినియోగంలోకి తీసుకురాలేదని, అర్హులకు పట్టాలు, పింఛన్లు ఇవ్వలేదని ఇలా అనేక సమస్యలు తెలిపారు. త్వరలోనే జనసేన, టీడీపీ ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం రాబోతోందని మీ సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు ఎల్లబోయిన రామకృష్ణ, మల్లె భాస్కర్, గరికిన సురేష్, సోదే ముసలయ్య, సురడా శ్రీను తదితరులు, జనసేన యువత మరియు తెలుగుదేశం నాయకులు, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.