బుడగరాయి గ్రామంలో జనసేన, టీడీపీ నాయకుల గుడ్ మార్నింగ్ కార్యక్రమం

పాలకొండ నియోజకవర్గం: సీతంపేట మండలం, బుడగరాయి గ్రామంలో జనసేన, టిడిపి పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో సూపర్ సిక్స్ పథకాలు గురించి సీతంపేట మండలంలో తెలియజేయడానికి పాలకొండ నియోజకవర్గం జనసేన నాయుకులు సమన్వయ కర్త నిమ్మల నిబ్రమ్, టీపీడీ నాయకులు నియోజకవర్గం ఇంచార్జ్ నిమ్మక జయకృష్ణ ఆదేశాల మేరకు సీతంపేట మండల జనసేన, టీడీపీ నాయుకులు గుడ్ మార్నింగ్ కార్యక్రమం చెయ్యడం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గిరిజన ప్రాంతాలు అభివృద్ధి జరగాలి అంటే పాలకొండ నియోజకవర్గంలో టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా ఎవ్వరికి టికెట్ వచ్చినా గెలిపించే బాధ్యత మన అందరిపైన ఎంతో ఉంది. కనుక రాష్ట్రములో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయకత్వం పాలకొండ నియోజకవర్గంలో జయకృష్ణ నిబ్రమ్ గారు నాయకత్వం బలోపేతం కావాలి అని ఈ సందర్బంగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సింహాద్రి, రాజేష్ మరియు టీడీపీ నాయకులు సూర్యం, సూరిబాబు పాల్గొనడం జరిగింది.