పవన్ ఫోబియా వైసీపీ నాయకులను వెంటాడుతోంది

చంద్రగిరి, నేడు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకు వెన్ను ధన్నుగా నిలుస్తూ వారి కష్టాలలో తోడుంటూ, సరి కొత్త ప్రణాళికలతో, ప్రజలకు మేలు చేసే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నాయకుడు పవన్ కళ్యాణ్, అయనకి ప్రజలలో ఏర్పడుతున్న ఆదరణను చూసి ఓర్వలేకే వైసీపీ ప్రభుత్వం ఆయన చుట్టూ రెక్కి నిర్వహిస్తూ, ఆయన అడ్డు తొలగించుకునే ప్రయత్నం చేస్తోంది, ఇలాంటి వాటికీ జనసైనికులు గానీ మరీ ముఖ్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్ అసలు భయపడరు. ఈ మధ్యకాలంలో చూస్తే వైసీపీ నాయకులు ఏ ప్రెస్మీట్ పెట్టినా, సభ పెట్టినా పవన్ కళ్యాణ్ పేరును ఎత్తకుండా ఆ కార్యక్రమాన్ని ముగించటం లేదు, వైసీపీ నాయకులకు పవన్ కళ్యాణ్ కంటిలో నలుసులా తయారయ్యారు. పవన్ ఫోబియా వైసీపీ నాయకులను వెంటడుతోంది, పవన్ కళ్యాణ్ ని అడ్డు తొలిగిస్తే వైసీపీ నాయకులు యధేచ్చగా వారి దోపిడీని కొనసాగించవచ్చు అనే ఆలోచనలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ జనవాణి, కౌలురైతుల భరోసా యాత్ర పేరుతో ఎలా ప్రజలకి అండగా నిలబడాలి అని ఆలోచిస్తుంటే, వైసీపీ మాత్రం మూడు రాజధానుల పేరుతో ఎలా రాష్ట్రాన్ని దోచుకోవాలి అనే ఆలోచనలో ఉంది. పవన్ కళ్యాణ్ పైన చిన్న గీతపడినా దాని తరువాత జరిగే తీవ్ర పరిణామాలు మీరు తట్టుకోలేరు అని హెచ్చరిస్తున్నామని చంద్రగిరి నియోజకవర్గ జనసేన నయకులు నసీర్ అన్నారు.