పార్టీ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉండాలి: సోమరౌతు అనురాధ

వేమూరు నియోజకవర్గం: రాబోయే ఎన్నికలకు తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించడం పార్టీ నాయకులకు ఆమోదయోగమని అధినాయకుడు నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉంటామని జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి సోమరౌత్ అనురాధ పేర్కొన్నారు. శుక్రవారం వేమూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయానికి ప్రతి ఒక్క జనసైనికులు కట్టుబడి ఉండాలన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన అంతమొందించడానికి పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో గుర్తుపెట్టుకునేందుకు నిర్ణయించారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ప్రజల సంక్షేమాని దృష్టిలో ఉంచుకుని జనసేన ముందుకు సాగుతుందన్నారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించినప్పటి నుండీ ఒకే మాట చెబుతున్నారని డబ్బు కోసం, పదవుల కోసం పనిచేయదని రాష్ట్ర అభివృద్ధికి ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉంటుందన్నారు. జనసైనికులు పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయాల ప్రకారం కార్యక్రమం రూపొందించుకునే ప్రజల్లోకి వెళ్లాల్సిన ఆవశ్యకత ఉందని గుర్తు చేశారు. సమావేశంలో పార్టీ నాయకులు సోమవతి బ్రహ్మం, అద్దంకి సూర్యనారాయణ వెలివెల, బొల్లి ముంత సుధాకర్, ఆలపాటి రాజేష్, ఎలీషా తదితరులు పాల్గొన్నారు.