ప్రజలకు చేరువ కావటమే పవనన్న ప్రజాబాట లక్ష్యం: బొర్రా

సత్తెనపల్లి, ప్రజలకు చేరువ అవటమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లక్ష్యమని అందుకే ప్రజాబాట కార్యక్రమాన్ని రూపొందించారని జనసేన సత్తెనపల్లి సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు అన్నారు. శనివారం పట్టణంలోని 16వ వార్డులో పవనన్న ప్రజాపాట కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా శాస్త్రి నగర్ లోని సీయోను దేవాలయంలో ప్రార్ధనలు అనంతరం ఇంటింటికి పవనన్న ప్రజాబాట కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగినది. ప్రతి ఇంటికి తిరిగి పవన్ కళ్యాణ్ లక్ష్యాలను ఆశయాలను భవిష్యత్తు హామీలను భరోసాలను ప్రజలకు తెలియజేస్తున్నామన్నారు. రైతులకు అండగా యువతకు మహిళలకు భరోసాగా వృద్ధులకు ఆసరాగా జనసేన ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, అభిమానులు, కార్యకర్తలు భారీగా పాల్గొని విజయప్రదం చేయటం చాలా సంతోషాన్నిచ్చిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి వెంకట సాంబశివరావు, ఏడో వార్డు కౌన్సిలర్ రంగశెట్టి సుమన్, ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు బత్తుల కేశవ, నకరికల్లు మండల అధ్యక్షురాలు తాడువాయి లక్ష్మి శ్రీనివాస్, ముప్పాళ్ళ మండల అధ్యక్షులు సిరిగిరి పవన్ కుమార్, దార్ల శ్రీను, మాజీ సర్పంచ్ ఉదయ్ భాస్కర్, పుష్ప నామాల, రామిసెట్ట శ్రీను, 16వ వార్డు కౌన్సిలర్ అబ్రహం, జయబాబు, చిలకా కోటి, తాళ్లూరి కుమార్, కొమ్మంపాటి దానియేలు, జనసేన, తెలుగుదేశం నాయకులు, వీర మహిళలు, జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.