డాక్టర్ కందుల ఆధ్వర్యంలో 35వ రోజు పవనన్న ప్రజాబాట

విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32వ కార్పొరేటర్, డాక్టర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో పవనన్న ప్రజాబాట నిర్విరామంగా కొనసాగుతోంది. శుక్రవారం ఈ కార్యక్రమం 35వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా 41 వ వార్డు జ్ఞానాపురంలో పర్యటించారు. అనంతరం డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ గత 35 రోజులుగా చేపడుతున్న ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందన్నారు. సుమారుగా దక్షిణ నియోజకవర్గంలోని అన్ని వార్డుల్లోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా వెళ్లిన ప్రతిచోట ప్రజలు సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.జనసేన ప్రజల పార్టీ అని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై తమ పార్టీ అలుపెరగని పోరాటం చేస్తుందన్నారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు చేపడుతున్న కార్యక్రమాలలో పార్టీ నేతలు అందరూ స్వచ్చందంగా పాల్గొంటున్నారని చెప్పారు. పార్టీ బలోపేతానికి అవిరల కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. రానున్నది జనసేన ప్రభుత్వమేనని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సీనియర్ నాయకులు అంతోని శేఖర్, రామారావు, ప్రసాద్, శివ ,అనిల్, తెలుగు అర్జున, అప్పారావుతో పాటు పలువురు జనసైనికులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.