రాజంపేటలో జోరుగా 84వ రోజు పవనన్న ప్రజాబాట

రాజంపేట నియోజకవర్గం, మందపల్లి పంచాయితీ, పులుపుతూరు పంచాయతీలోని పలు గ్రామాలు అడవిరాశిపల్లి, రాజంపేట అసెంబ్లీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు పవనన్న ప్రజాబాట ముందుకు తీసుకువెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమంలో అక్కడ ఉండే ప్రజలు ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం డ్యాం తెగిపోయినా ఇంతవరకు ఈ గవర్నమెంట్ ద్వారా ఏ ఒక్క రూపాయి కూడా రాలేదని ఆ గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. రాబోవు 2024 ఎన్నికలలో ఓట్ల రూపంలో ఈ గవర్నమెంట్ కి బుద్ధి చెప్తామని ప్రజలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య, జనసేన నాయకులు పోలిశెట్టి శ్రీనివాసులు, కొత్తూరు వీరయ్యచారి, హేమంత్, జనసేన వీర మహిళలు జెడ్డా శిరీష, మాధవి తదితరులు పాల్గొన్నారు.