విజయవంతంగా 70వ రోజుకు చేరుకున్న పవనన్న ప్రజాబాట..

  • రాటాల రామయ్య చేపట్టిన పవనన్న ప్రజాబాట.. 70వ రోజుకు చేరుకున్న పవనన్న ప్రజాబాట

ఒంటిమిట్ట: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి చేయాలన్న దృఢ సంకల్పంతో ప్రజల ఆశీర్వాదంతో కొనసాగుతున్న పవనన్న ప్రజా బాట కార్యక్రమం విజయవంతంగా శుక్రవారం నాటికి 70 రోజులు పూర్తి చేసుకుంది. రాజంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మీదకు జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య ఆధ్వర్యంలో ఒంటిమిట్ట మండల పరిధిలోని మండపం పల్లె గేటు గ్రామంలో పవనన్న ప్రజా బాట కార్యక్రమం కొనసాగించారు. అక్కడ ప్రజల ఇబ్బందులను తెలుసుకుని జనసేన పార్టీ తరఫున తన వంతు కృషి చేస్తానని రాటాలరామయ్య ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన వీరమహిళలు, తదితరులు పాల్గొన్నారు.