క్రియాశీలక సభ్యునికి భరోసా ఇచ్చిన పాయకరావుపేట జనసేన

పాయకరావుపేట నియోజకవర్గంలో ఎస్ రాయవరం మండలం భీమవరం గ్రామంలో క్రియాశీలక సభ్యుడు మాడాగల ప్రసాద్ కి ఒక నెలముందు జరిగిన బైక్ ప్రమాదం వలన కాలుకి 3 ఆపరేషన్లు జరిగాయి. ఈ విషయం తెలుసుకొని భీమవరంలో జనసైనికులు వెళ్లి ధైర్యం చెప్పి త్వరలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మన కోసం ప్రవేశపెటిన క్రియాశీలక సభ్యత్వానికి కావలసిన పత్రాలు అన్నీ సమర్పించడం జరిగిందని అందువలన త్వరలో చెక్ అందజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో లింగంపల్లి బాలకృష్ణ, భేశెట్టి సతీష్, థకాసి కిషోర్, మాడాగల రాజు, జంపా దొరబాబు మరియు జనసైనికులు పాల్గొన్నారు.