పవన్ వస్తాడు – పాలన మారుస్తాడు: మత్స పుండరీకం

పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలం, నడుకూరు గ్రామంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం వాలంటీర్ మత్స పుండరీకం నరిసిపురం గ్రామ జనసైనికులతో సమావేశం అయ్యారు. అనంతరం మత్స పుండరీకం మాట్లాడుతూ.. జె.ఏస్.పి అనగా (జె)జనం కోసం (ఏస్)స్థాపించిన (పి)పార్టీ అని అన్నారు. పవన్ రావాలి పాలన మారాలి నిన్నటి మాట.. పవన్ వస్తాడు – పాలన మారుస్తాడు నేటి మాట. ఈ రాజకీయ వ్యవస్థను సమూలంగా మారుస్తాడు. మన ధ్యేయం జనసేన పార్టీ విజయం.. మన లక్ష్యం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిని చేయడం అని జనసైనికులకు సూచించారు. మీరు మీ.. మీ గ్రామంలో రైతులవద్దకు వెళ్లి ఖరీఫ్ సాగు కు విత్తనాలు, ఎరువులు అందాయా లేదా.. గ్రామంలోని కౌలురైతులకు అండగావుండాలని కోరారు. నరిసిపురం జనసైనికుడు చింత గోవర్ధన్ మాట్లాడుతూ గ్రామ ప్రజలను కలసి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న కౌలురైతులు మూడు వేల మంది కుటుంబాలకు లక్ష రూపాయలు చొప్పున ముప్పై కోట్ల రూపాయలు స్వచ్ఛందంగా పంచుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి సేవలను ప్రజలకు తెలిసేవిధంగా ఇంటి ఇంటికి వెళ్లి ప్రచారం చేయాలని కోరారు. దంగా కార్యక్రమంలో బి.పి.నాయుడు, వాన మహేష్, వావిలిపల్లి నాగభూషన్, బొత్స శ్రీనివాసరావు, దత్తి గోపాలకృష్ణ, దండేల సతీష్, అన్ను రామకృష్ణ, కలిపిల్లి సింహ చలం తదితరులు పాల్గొన్నారు.