పెన్షన్లను యధాతధంగా కొనసాగించాలి: వైస్ ఎంపీపీ ఇంటిపల్లి

  • కుంటిసాకులతో పెన్షన్లను నిలుపుదల చేస్తే జనసేన తరఫున ఉద్యమం తప్పదు

రాజోలు, పెన్షన్లను యధాతధంగా కొనసాగించాలని కోరుతూ రాజోలు మండల వైస్ ఎంపీపీ ఇంటిపల్లి ఆనందరాజు రాజోలు ఎంపీడీవో ఇసుకపట్ల ఇమ్మానియేలు కుమార్ కు బుధవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ ఇంటిపల్లి మాట్లాడుతూ రాజోలు మండల పరిధిలో రెండు వందల ముపై నాలుగు పెన్షన్లను వెరిఫికేషన్ నిమిత్తం సంబంధిత రిమార్క్ లతో మండల కార్యాలయానికి వచ్చినవని, వాటిని నోటీసుల రూపంలో గ్రామ వాలంటరీల ద్వారా ఆయా లబ్ధిదారులకు పంపించడం జరిగిందని అన్నారు. అయితే వెరిఫికేషన్ కు వచ్చిన రెండు వందల ముపై నాలుగు పెన్షన్ల లబ్దిదారులను అర్హులుగా గుర్తించి వారందరికీ పెన్షన్ల యధావిధిగా కొనసాగించాలని ఎంపీడీవో లిఖితపూర్వకంగా కోరినట్లు ఇంటిపల్లి విలేఖర్లకు తెలిపారు. కుంటిసాకులతో పెన్షన్ల నిలుపుదల చేస్తే ఉద్యమం చేబడతామని ఇంటిపల్లి ఆనందరాజు అన్నారు. వినతిపత్రం ఇచ్చిన ఇంటిపల్లి తో పాటు కోఆప్షన్ సభ్యులు కూడా ఉన్నారు.