వైసీపి ఎమ్మెల్యేలపై, మంత్రులపై విరుచుకుపడిన పెనుకొండ జనసేన నాయకులు

పెనుకొండ, ఇప్పటం గ్రామం లో జరిగిన కూల్చివేతలను పెనుకొండ జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇప్పటం గ్రామ ప్రజలు చేసిన నేరం ఏంటి మార్చి 14 జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ పెట్టుకోడానికి స్థలం ఇవ్వడమే వారు చేసిన నేరమా? మరీ ముఖ్యంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లినా అడ్డుకోవడానికి చూస్తున్నారు. ఇది ముమ్మాటికీ రాజకీయ కక్షే మీరు ఇలాగే చేస్తే మీ ప్రభుత్వం కూలడం ఖాయం. మీ ప్రభుత్వ పతనం దిశగానే మా అడుగులు ఉంటాయని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యేలను మంత్రులని పెనుకొండ జనసేన నాయకులు హెచ్చరించారు. మండల అధ్యక్షులు మహేష్, నాయకులు రాజేష్, హరి నాయక్ మాట్లాడుతూ శనివారం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇప్పటం గ్రామ ప్రజలను పరామర్శించడానికి వెళితే అక్కడ పోలీస్ యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకొని జనసేన పార్టీ అధ్యక్షులని ఆపడం చాలా దురదృష్టకరం, ఒక ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అధ్యక్షులు ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ప్రజల దగ్గరికి వెళ్ళనీయకుండా అడ్డుకోవడం సరికాదని ఇకనైనా మీ తీరు మార్చుకోకపోతే అదే ప్రజలు మీకు తగిన బుద్ధి చెబుతారని తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు రాజేష్, పెనుగొండ మండల జనసేన పార్టీ అధ్యక్షులు మహేష్, పెనుకొండ మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షులు మంజునాథ్, సురేష్, సీనియర్ నాయకులు బంగారం, హరి నాయక్, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.