జగన్ మోసమాటలు నమ్మే స్థితిలో ప్రజలులేరు

  • జగన్ మోహన్ రెడ్డిని సొంత చెల్లెలే నమ్మడం లేదు మనం ఎందుకు ఓటెయ్యలి
  • సొంత కుటుంబానికి మేలు చేయలేని వాడు రాష్టానికి ఏమి చేస్తాడు
  • 41వ రోజు 20వ డివిజన్ లో కొనసాగిన మహిళలతో మాటామంతి కార్యక్రమం
  • జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత

అనంతపురం అర్బన్ నియోజకవర్గం: జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత శుక్రవారం మహిళలతో మాటామంతి 41వ రోజు కార్యక్రమంలో భాగంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోని స్థానిక 20వ డివిజన్ లో పర్యటించి స్థానిక మహిళలతో మమేకమై సమస్యలు తెలుసుకొని జనసేన టీడీపీలకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగన్ రెడ్డి మోసపు అపద్దపు మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని సొంత చెల్లెలే జగన్ ని నమ్మలేదని కుటుంబానికి మేలు చేయలేని జగన్ రెడ్డి రాష్టాన్ని ఏమి అభివృద్ధి చేస్తాడని కుటుంబ సభ్యుడైన వివేకనంద రెడ్డినే రాజకీయ లబ్ధికోసం పొట్టనపెట్టుకున్న నీచపు చరిత్ర జగన్ ది అని.. ఇది 2019 కాలం కాదని ప్రజలందరూ గ్రహించి జగన్ కు బుద్ది చెప్పి జనసేన టీడీపీ పార్టీలకు ఓటు వేయడానికి సంసిద్దులై ఉన్నారని. జనసేన టీడీపీ పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో ఆంధ్ర రాష్ట్రాన్ని సంక్షేమం అభివృద్ధి వైపు నడిపే విధంగా ఉందని, ఈ విషయాలన్నీ ప్రజలకు వివరంగా వివరిస్తున్నామని ప్రజలంతా సానుకూలంగా స్పందిస్తారని అన్నారు. వచ్చేది, సుపరిపాలన అందించేది ఉమ్మడి ప్రభుత్వమే అన్నారు. ఈ కార్యక్రమంలో వీరమహిళలు, జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.