రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ప్రజలారా గమనించండి: దారం అనిత

చిత్తూరు జిల్లా జనసేన ప్రధాన కార్యాదర్శి దారం అనిత మాట్లాడుతూ.. గడప గడపకు ప్రభుత్వ కార్యక్రమంలో పథకాల లిస్ట్ చదువుతుంటే.. లబ్దిదారుడు తమకు ఇంటి కోసం అప్లికేషన్ పెట్టుకున్నా రాలేదు అనగానే పోలవరం ఎమ్మెల్యే బాలరాజు అనుచరులు వారిపై దాడికి ఎగబడ్డారు. పెన్షన్ ఎప్పటినుండో వస్తుంది అని చెబితే మా ప్రభుత్వం ఇస్తుంది తీసుకోవద్దు అంటున్నారు. అర్హత ఉంటే ఇవ్వం అనడానికి మీరు ఎవరు? రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో దయచేసి ప్రజలు గమనించండి దారం అనిత తెలియజేశారు.