నిడమర్రు గ్రామంలో జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

ఉంగుటూరు నియోజకవర్గం, నిడమర్రు మండలం, నిడమర్రు గ్రామంలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా.. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం కిట్లను పార్టీ యువ నాయకుడు దూసనపూడి ఉమ సురేష్ చేతుల మీదగా జనసైనికులు కూచిపూడి చెందు, కూచిపూడి సుబ్బారావు, దూసనపూడి వేంకటేష్, కన్నజి చిన్ని, పోతు సాయి, బేతాళ మూర్తి, మరి కొందరు జనసైనికులకు అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.