రైతు కూలీలకు టిఫిన్ బాక్స్ లు పంపిణీ చేసిన జనసైనికులు

*జాయింట్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు సుమన్ తల్లి స్మారకార్ధం
*పంపిణీ చేసిన ఐనవోలు మండలాధ్యకుడు బర్ల శివ

ఐనవోలు: ప్రజోపయోగ కార్యక్రమాలు చేయడంలో ఎల్లప్పుడూ ముందుండే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లోనే జన సైనికులు పయనిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. తాజాగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నెమూరి శంకర్ ఆదేశాల మేరకు.. ఇటీవల మరణించిన ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఆకుల సుమన్ తల్లిగారైన ఆకుల పద్మ జ్ఞాపకార్ధం వారి తల్లిదండ్రులు పేరిట ఐనవోలు మండలం లోని రైతు కూలీలకు ఐనవోలు మండల జనసేన పార్టీ మండల అధ్యక్షుడు బర్ల శివ ఆధ్వర్యంలో టిఫిన్ బాక్సులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బర్ల శివ మాట్లాడుతూ.. ప్రార్ధించే పెదవుల కన్నా సాయం చేసే మిన్న అన్నపదానికి న్యాయం చేసేలా మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పూర్తితో వానాకాలం రైతులకు, రైతు కూలీలకు మధ్యాహ్న భోజనం పట్టుకొని వెళ్ళేలా ఈ చిన్ని సహాయాన్ని టిఫిన్ బాక్సుల రూపంలో వారికి అందించటం జరిగింది అన్నారు. చేసేది చిన్న సహాయమే అయినా ఇతరులకు సహాయం చేయాలన్న తపనను అందరిలో కలిగించాలన్న గొప్ప సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అండగా నిలిచిన జన సైనికులు అందరికీ ఈ సందర్భంగా శివ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బర్ల ప్రవీణ్, ఆకులపెళ్లి వినయ్ కుమార్, బర్ల జానీ, ఆకులపెళ్లి శ్రీకాంత్, బర్ల మహేందర్, తొగరు శేఖర్, పెరుమాళ్ళ రఘు, యాకర శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.