జనంలోకి జనసేన కార్యక్రమం విజయవంతం చేయాలి

నరసాపురం నియోజకవర్గం నరసాపురం మండలం తూర్పుతాళ్ళు గ్రామం నుండి జనంలోకి జనసేన కార్యక్రమం ప్రారంభం అని నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి బొమ్మిడి నాయకర్ ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ జనసేన మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకర్ అన్నారు.